ADB: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని గిరిజన గురుకులాల ఆర్సీవో అగస్టీన్ సూచించారు. ఉట్నూర్ మండలంలోని లాల్ టెక్డిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.