WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్య శారద సందర్శించి, పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, సైన్స్ ల్యాబ్, ఏటీఎల్ ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించాలన్నారు.