కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. విగ్రహ స్థాపన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.