WNP: నర్సింగయ్యపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్సై నరేష్ మానవత్వం చాటుకున్నారు. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ అందుబాటులో లేని పరిస్థితిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించారు. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడిని తన బైక్ పైనే ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.