పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025 భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కృష్ణ ఆగ్రో, మైహోం సిమెంట్స్, ఇంధనఎనర్జీస్ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిపై చర్చించారు.