KMM: నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. శనివారం 17,35 డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి సందర్శించి పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ఆరా తీశారు. కమిషనర్ వెంట మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు.