NDL: మిడుతూరు మండల కేంద్రంలో NCCF ఏపీ మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల నూతన కొనుగోలు కేంద్రాన్ని MLA జయసూర్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి శనగలను ప్రభుత్వం మద్దతు ధర రూ. 5875తో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.