పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4,748 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4668 మంది పరీక్ష రాశారు. 80 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.