HYD: గచ్చిబౌలి హాకీ స్టేడియం మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7.30 గంటలకు CM రేవంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించనున్నారు.