MBNR: హమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ ముక్కోటి మైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం ‘బండ్లోత్సవం’, రేపు ‘బోనాలు’, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాధిర్యాల్, రుసుంపల్లి తదితర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.