TG: మాజీమంత్రి KTR వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. KCR తెలంగాణకు ఓజీ కాదు.. నాజీగా పని చేశారని, తెలంగాణకు తురుపు ముక్క కాదు.. కలుపు మొక్క అని విమర్శించారు. నాజీ నియంతలా పదేళ్లు తెలంగాణ ప్రజలను అణిచివేశారని, అందుకే ప్రజలు అధికారం నుంచి దించేశారన్నారు. ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి ఉంటే మీరంతా ప్రతిపక్ష నాయకుడితో సభకు రావాలని సవాల్ విసిరారు.