NGKL: నాగర్కర్నూల్ సమీపంలోని వనపట్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న గన్నోజ్ సురేష్ చారి(40) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సోమశిలకు వెళ్తున్న కారు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.