SDPT: దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో సర్పంచ్ తోడంగి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ పాలక మండలి సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశం జరుగుతుండగా కొందరు వ్యక్తులు, యువకులతో కలిసి వచ్చి సర్పంచ్, పాలక మండలి సభ్యులపై దాడికి యత్నించినట్లు సమాచారం. గ్రామస్థులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సర్పంచ్ భర్తపైనా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది.