‘డాన్ 3’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తనపై నిషేధం విధించిన FWICE సంస్థకు రణ్వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపాడు. దీనిపై FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పందిస్తూ.. తమకు నోటీసులు అందినట్లు ధ్రువీకరించారు. ఈ వివాదంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.