S.J సూర్య ‘కిల్లర్’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై బిన్నీ మిల్స్లో యాక్షన్ సీన్ల చిత్రీకరణ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.