NDL: బీజేపీ యువమోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. విజయ భాస్కర్ శుక్రవారం ఎన్నికయ్యారు. 2014 నుంచి డోన్ పట్టణంలో విద్యార్థి హక్కుల కోసం ఉద్యమం చేశారు. యువత శక్తిని జాతీయ నిర్మాణంలో భాగం చేయడం, కేంద్ర సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు.