TG: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు తమ ఆస్తులను అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. మాటలు కాదు.. చేతల్లో చూపిస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణ యువత పవన్ వెంట నుడుస్తోందని చెప్పారు. ఇవాళ హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో శంకర్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.