SRPT: నూతనకల్ మండలం నుంచి వెంకేపల్లి వరకు నిలిచిపోయిన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవనంలో మంత్రిని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు.