ATP: గుంతకల్లు పట్టణంలోని సక్సెస్ హై స్కూల్ ఎదురుగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ.. హైస్కూల్లో సరైన మౌలిక వసతులు లేవని, విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇలాంటి పాఠశాలలను సీజ్ చేయాలన్నారు.