VSP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకి రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. మధురవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీటి సరఫరా,సెమీ బల్క్ వాటర్ సప్లై అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.