సత్యసాయి: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.