TG: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను సంపులో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సల్కెలపురం శివారులోని మామిడి తోటలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.