VZM: ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంగళవారం గంట్యాడలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాజుల పొల్లంకిలోని కర్రివాని చెరువు వద్ద ఉపాధి హామీ పనులకు వెళ్లిన సన్యాసిరాజు పని ప్రదేశంలో కుప్పకూలాడు. శ్రామికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సన్యసిరాజును పరీక్షించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్థారించారు.