అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లి వద్ద శుక్రవారం పందిని తప్పించబోయి లారీ ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడు వెలగచర్ల నాగేంద్రబాబు(30)గా స్థానికులు గుర్తించారు.ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.