PDPL: ధర్మారం పట్టణంలో ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో కలిపి మొత్తం 539 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స సౌకర్యం కల్పించారు.