AKP: ఉత్తరాంధ్రకు వెన్నెముక అయిన సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా పూర్తి చేయగలిగితే 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయవచ్చునని అన్నారు. సాగునీటి సౌకర్యం లేక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.