AP: ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా పదేపదే అడ్డుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు భయపడుతున్నారని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.