CTR: కుప్పం ఇన్ఛార్జ్ ఆర్డీవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. 2018 గ్రూప్-1కు సంబంధించిన అధికారులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అప్రాధాన్య పోస్టుల్లో నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కుప్పం RDO శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో KRC డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మికి ఇన్ఛార్జ్ ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.