NZB: నవీపేట్ మండలంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ, అయ్యప్ప ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. గురువారం అయ్యప్ప గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2,770 నగదు, బైక్, రాగి వైర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనే 7 కేసులు ఉన్నాయని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.