NRML: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం చేయవద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని, హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం రవాణాను వేగవంతం చేయాలన్నారు.