SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నందున పైప్ లైన్ షిఫ్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైన కలనీలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.