అన్నమయ్య: పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై పుర వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భజన కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయంలో విశేష హోమాలు, అన్నప్రసాద వితరణ కొనసాగుతున్నాయి.