KMR: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని కామారెడ్డి జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సంతోష్ స్పష్టం చేశారు. గురువారం ఇబ్రహీంపేట ZPHSలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు.