ELR: ఉంగుటూరు(మం) రాచూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఇంటి పన్ను, కుళాయి పనులు వసూళ్లు చేస్తున్నారు. డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు పన్ను వసూళ్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలములో ఇంటి పన్ను వసూళ్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి సుజాత, సచివాలయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.