ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధతో మానవాళికి పొంచి ఉన్న ముప్పు పూర్తిగా కొట్టిపారేయలేమని అన్నారు. ఏఐ పురోగతిని ఇంకా చాలా మంది అర్థం చేసుకోలేక పోతున్నారని తెలిపారు. ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే..ఓ పెద్ద మహమ్మారిని విస్మరించినట్లేనని చెప్పారు. మనుషులను మించిన సామర్థ్యం ఉండే ఈ సాంకేతికత నుంచి ముప్పు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు.