ప్రకాశం: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ హెచ్చరించారు. గురువారం పామూరులో నిర్వహించిన తనిఖీల్లో టాక్స్ చెల్లించని ఒక స్కూల్ బస్సు, రెండు టిప్పర్లకు మొత్తం రూ.1.55 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. రవాణా వాహనాలు విధిగా ట్యాక్స్ చెల్లించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.