NLR: రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన నిరుపేదలకు త్వరితగతిని ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గిరిజనులకు మంజూరైన 1,000 పక్కా గృహాలకు భూసేకరణ చేయాలని ఆదేశించారు.