పోలవరం: జిల్లాలోని 46,936 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.19.61 కోట్లు విడుదల చేసిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ బుధవారం తెలిపారు. రాజవొమ్మంగి మండలానికి అత్యధికంగా రూ. 2.5 కోట్లు మంజూరయ్యాయి. మే 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లబ్ధిదారులందరూ అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.