CTR: నగరి రూరల్ మండలం గుడి కండ్రిగలో ఘనంగా గంగ జాతర మహోత్సవం నిర్వహించారు. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగ జాతర సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.