VZM: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఫిబ్రవరి 28న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు 1 నుండి 7వ స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు అందరూ హాజరై అభివృద్ధి పనులపై చర్చించాలని కోరారు.