AP: NTR భరోసా పింఛన్లను ఈ నెల 28న పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1న ఆదివారం వచ్చినందున ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ జరుగుతుందన్నారు. 28న 100 శాతం పింఛన్ నగదు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పింఛను పొందేందుకు పింఛనుదారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండాలని సూచించారు.