VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.