KNR: శంకరపట్నం మండలం గద్దపాకలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్మేయడంతో ధాన్యాన్ని కుప్పలు పోస్తుండగా గ్రామానికి చెందిన కొయ్యడ ఐలయ్య ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానిక రైతులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.