JGL: అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకుని లేబర్ కార్డు పొందాలని రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ రవీందర్ అన్నారు. రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మెట్ పల్లి కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డుల నమోదు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి అసిస్టెంట్ కార్మిక శాఖ అధికారి కృష్ణ సాగర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.