KMR: అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టం కలగకుండా వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పీపీసీల వద్ద ధాన్యం తడవకుండా తార్పాలిన్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్వంచ పీపీసీని కలెక్టర్ సందర్శించారు. తూకం, రవాణా ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.