AP: కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 18, 19న తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరిగే జంతు బలులను నిషేధించాలని కోరారు. ఏటా ఈ ప్రాంతంలో జరుగుతున్న జంతు బలుల గురించి ఎంతో మంది తనకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వేలాది జంతువులను ఏ కారణం లేకుండానే చంపుతున్నారని పేర్కొన్నారు.