AKP: మాడుగుల మండలం పొంగలిపాక సచివాలయాన్ని ఎంపీడీవో కొంకి అప్పారావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమయపాలన పాటించాలని, విధులు పట్ల అంకితభావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పమని హెచ్చరించారు. జనగణన కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని సూచించారు.