SRPT: బక్రీద్ పండుగ సందర్భంగా మత పెద్దలు, గోరక్షణ సంఘాలతో పోలీసులు సమావేశమయ్యారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, అనుమానిత సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. పండుగను అందరూ ప్రశాంతంగా, సామరస్యంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.