HYD: శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలోని స్పీకర్ అధికార నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్కు స్పీకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయగా, స్పీకర్ను డీజీపీ పుష్పగుచ్ఛంతో సత్కరించారు.