MNCL: బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ పాల్గొని రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియాను సమతుల్యంగా, అవసరానికి అనుగుణంగా వాడాలని సూచించారు. అలాగే ప్రస్తుత మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సన్నరకం వంటి వరి రకాల సాగు చేయాలని రైతులకు సూచించారు.